లోకాయుక్తను గవర్నర్
నియమించడం సమంజసమేనని బుధవారం గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో
రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం గురువారం
సుప్రీంకోర్టుకెళ్ళింది. తమను సంప్రదించకుండా గవర్నర్ లోకాయుక్తను
నియమించడాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను రాష్ట్ర హైకోర్టు
బుధవారం కొట్టివేసింది. దాంతో గుజరాత్ ప్రభుత్వం ఈ రోజు సుప్రీంకోర్టుకు
వెళ్ళింది.